చిరంజీవి కీలక ప్రకటనకు వేదిక కానున్న జూలై 29 !

Seetha Sailaja
రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిoదుడు అందరివాడేలే’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 29న భాగ్యనగరంలోని నానకరాంగూడలో ఉన్నరామానాయుడు స్టూడియోలో జరగబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి కేవలం కొంతమంది ఎంపిక చేసిన కొందరు అభిమానులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని సమాచారం. చాలా కాలం తర్వాత చిరంజీవి ఇలా పబ్లిక్ ఈవెంటులో పాల్గొంటుండటంతో ఆహ్వానం అందిన మెగా అభిమానులు చాల ఆనందపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఫంక్షన్ లో చిరంజీవి తన150వ సినిమా విశేషాలు వెల్లడిస్తారని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి శంకర్ దర్సకత్వం వహించబోతున్న ‘రోబో-2’ సినిమాలో నటిస్తాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు ఊపు అందుకున్నాయి. దీనికి కారణం ఈ సినిమాలో రజినీకాంత్ ను నటించమని ఈ సినిమా దర్శకుడు శంకర్ కోరుతున్నా రజినీ తన ఆరోగ్యం సహకరించడంలేదని చెపుతూ ఈ పాత్రకు కమలహాసన్ లేదా చిరంజీవి బాగుంటారని రజనీ శంకర్ కు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  దీనితో ‘రోబో-2’ సినిమా విషయంలో దర్శకుడు శంకర్ మనసులో చిరంజీవి ప్రవేశించాడు అంటూ మరో కొత్త గాసిప్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజకీయ వార్తలలో ప్రస్తుతం లేకపోయినా తన సినిమా వార్తలతో మీడియాకు చిరంజీవి హాట్ న్యూస్ గా మారిపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: