ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అరెస్టు చేసిన పోలీసులు.. కారణం..?

Divya
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తాజాగా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది.. అభిమానం చూపించే స్థాయి దాటి ఫ్యాన్స్ రెచ్చిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానం దాటి క్రాస్ చేస్తే దాన్ని పిచ్చి పరాకాష్టకు చేరుకోవడం అంటారు. తాజాగా ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది చేసిన రచ్చ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.. దీంతో అభిమానులు స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది వాటి గురించి తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బాగానే ఉన్నారు. సినిమాలు ఏవి విడుదలైనా సరే ఆ రాష్ట్రంలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు.తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలని అలాగే జరుపుకున్నారు.. కానీ హద్దులు  దాటడం జరిగింది..RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం రీసెంట్గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ని రీవీల్ చేయడం జరిగింది. టైటిల్ తో పాటు పోస్టర్ని కూడా ఇందులో విడుదల చేశారు ఇందులో ఎన్టీఆర్ కత్తి పట్టుకొని ఉన్న గెటప్ లో కనిపించడం జరిగింది.
దీన్నే కొంతమంది రియల్ లైఫ్ లో కూడా స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతోంది.. కొన్ని మీడియా కథనాలు తెలిపిన ప్రకారం కర్ణాటకలో రాబర్ట్ సన్ లోని ఒక థియేటర్ బయట ఉన్న ఎన్టీఆర్ దేవర కటౌట్ కి ఫ్యాన్స్ రక్త అభిషేకం చేశారు.. అంటే రెండు మేకల్ని అక్కడే చంపి వాటి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్ పైన పూయడం జరిగింది.ఆ తర్వాత మేకల శరీరాలను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో దీంతో దర్యాప్తు చేయగా ఏకంగా 9 మంది అభిమానులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. దీంతో పలువురు నెటిజన్లు సైతం వీరి గురించి మాట్లాడుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: