"పుష్ప ది రూల్" నుంచి బిగ్ అప్డేట్...!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ''పుష్ప ది రూల్''
ఈ సినిమా ''పుష్ప ది రైజ్'' సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.. అందుకే ఈసారి భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది..
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.పుష్ప రాజ్ రాక కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సీక్వెల్ అల్లు అర్జున్ బర్త్ డే కానుక గా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.
వీటికి విశేష స్పందన అయితే లభించింది. అప్పటి నుండి ఈ సినిమా కోసం మరింత ఎదురు చూస్తున్నారట.. సౌత్ కంటే కూడా నార్త్ ప్రేక్షకులు అయితే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సుకుమార్ కూడా ఎక్కడ అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రజెంట్ ఈ సినిమా షూట్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు అయితే వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా మరియు మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ ను ఓవర్సీస్ లో ప్లాన్ చేశారని తెలుస్తుంది... మరి ఇండియాలో షూట్ కంప్లీట్ చేయగానే యూరప్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం... అల్లు అర్జున్ ఈ సినిమా కు అధికంగా డేట్స్ కేటాయించాడు. ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నాడు అల్లు అర్జున్. మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు అల్లుఅర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: