ఆదిపురుష్: ట్రైలర్ తరువాత పెరిగిన డిమాండ్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ కృతి సనన్ సీతాదేవిగా కనిపించబోతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటించాడు.భారీబడ్జెట్ తో విజువల్ వండర్ గా సిల్వర్ స్క్రీన్ పై రామాయణంలో అరణ్యపర్వం యుద్ధపర్వం అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ రెండు మెయిన్ గా ఆదిపురుష్ స్టొరీలో భాగంగా ఉన్నాయనేది ట్రైలర్ చూస్తే ఈజీగా అర్ధమవుతోంది.ఇదిలా ఉంటే మొన్నటి దాకా ఈ సినిమాపై కొంత నెగిటివ్ ట్రెండ్ నడుస్తూ ఉండటం వలన ఆశించిన స్థాయిలో బజ్ అనేది క్రియేట్ కాలేదు. అయితే ఒక్క ట్రైలర్ ఈ సినిమాపై ఆడియన్స్ డిస్టిబ్యూటర్స్ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి.ఇది ప్రతి భారతీయుడికి తెలిసిన కథ అయిన కూడా ఓం రౌత్ తెరపై చూపించిన విధానం చాలా కొత్తగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు క్లోజ్ అయిపోయాయని సమాచారం తెలుస్తోంది.


యూవీ క్రియేషన్స్ ఓనర్స్ వంశీ ప్రమోద్ కూడా ఈ మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. తెలుగు థీయాట్రికల్ బిజినెస్ అంతా కూడా వీరే డీల్ చేశారు. ఆదిపురుష్ తెలుగులో 150 కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తోంది. నిజానికి ఇది పెద్ద నెంబర్ అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. పాన్ ఇండియన్ రేంజ్ లో హిందీ నుంచి తెలుగు డబ్బింగ్ సినిమాగా ఈ మూవీ రాబోతోంది. తెలుగు ఫ్లేవర్ మిస్ అయిన కూడా రామాయణం అనేది యూనివర్శల్ కాన్సెప్ట్ కాబట్టి ఆ పాత్రలలో ఎవరు నటించారు అనేదానితో సంబంధం లేకుండా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత ఆదిపురుష్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. నైజాం ఆంధ్రా సీడెడ్ కర్ణాటకలో తెలుగు బెల్ట్ లో ఇంకా నార్త్, గ్లోబల్ వైస్ గా ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుందనేదానిపై కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: