విజయ్... గౌతమ్ మూవీకి ఆ పాన్ ఇండియా సినిమాతోగ్రాఫర్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి సమంత , విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై చూపిస్తాడు అనే పేరు కలిగిన దర్శకుడు అయినటువంటి శివ నర్వనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నా రు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత విజయ్ ... గౌతమ్ తిన్నానూరి దర్శకత్వం లో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబో తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ... విజయ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది . ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలు కొన్ని రోజుల క్రితమే పూర్తయ్యాయి.  జూన్ నెల నుండి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కి పాన్ ఇండియా మూవీ విక్రమ్ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గ వర్క్ చేసినటు వంటి గిరీష్ గంగాధర్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: