అఖిల్ నెక్స్ట్ మూవీలో ఆ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్..?

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ "అఖిల్" మూవీ తో హీరో గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత హలో ... మిస్టర్ మజ్ను ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లలో హీరో గా నటించాడు. ఈ మూవీ లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో ఏజెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందించాడు.

ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే  బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమా పెద్ద మొత్తం లో కరెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట లేక పోతుంది. ఇది ఇలా ఉంటే అఖిల్ ఇప్పటికే తన తదుపరి మూవీ ని కూడా ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ తన తదుపరి మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్లో  చేయబోతున్నట్లు ... ఈ మూవీ కి ప్రభాస్ హీ రోగా రూపొందిన సాహో సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో అఖిల్ సరసన బాలీవుడ్ మోస్ట్ క్రేజీ బ్యూటీ జాన్వి కపూర్ ను హీరోయిన్ గ తీసుకునే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: