ఆ క్రేజీ బ్యానర్లో అఖిల్ నెక్స్ట్ మూవీ..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సునీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో అఖిల్ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హలో ... మిస్టర్ మజ్ను ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లలో హీరో గా నటించాడు. ఈ మూవీ లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

 సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని అనిల్ సుంకర నిర్మించగా ... సురేందర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఏప్రిల్ 28వ  తేదీన ఈ మూవీ భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే మంచి అంచనాలు విడుదలైన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

 దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే అఖిల్ ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ ని ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... అఖిల్ తన నెక్స్ట్ మూవీ ని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ బ్యానర్ గా కొనసాగుతున్న యు వి క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు ... ఈ మూవీ కి సాహో మూవీ కి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరి కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: