దళపతి విజయ్ 68వ మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్..?

Pulgam Srinivas
దళపతి విజయ్ ఆఖరుగా వారిసు అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన తమిళ భాషలో విడుదల అయ్యింది. ఆ తర్వాత ఈ మూవీ ని వారసుడు పేరుతో జనవరి 14 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేశారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... వంశీ పైడిపల్లి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా వారిసు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం లియో అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ...  త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ తన కెరీర్ లో 68 వ మూవీ ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ 68 వ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... విజయ్ 68 వ మూవీ కి "విక్రమ్ వేద" మూవీ దర్శకులు పుష్కర్ – గాయత్రీ లు దర్శకత్వం వహించనున్నారని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: