అందుకేనా దిల్ రాజు నిర్మాతగా మొదటి స్థానంలో ఉన్నది..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ దిల్ రాజకు మాత్రం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈయన ఎలాంటి సినిమా చేసిన అది మినిమం గ్యారంటీ లేని సినిమాగా పేరు సంపాదిస్తోంది. కానీ దిల్ రాజు మాత్రం ఏదైనా సినిమాతో నష్టం వస్తే వెంటనే ప్రాపర్టీ లోకి వచ్చే విధంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. గడచిన 15 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల చూసుకుంటే ఒక స్టార్డం కొనసాగుతున్న వారిలో దిల్ రాజు మాత్రం మొదటి స్థానంలో ఉన్నారు.

ఇతర అగ్ర నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. కానీ దిల్ రాజు తరహాలో స్ట్రాటజీలో ముందుకు సాగడం లేదని చెప్పవచ్చు. ఇటీవల దిల్ రాజు శాకుంతలం సినిమాతో  కాస్త ఎక్కువగా నష్టపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. రూ.40 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాని గుణశేఖర్ నిర్మించారు.. గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా సహనిర్మాతగా కొనసాగారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ మిగిలింది. దీంతో ఆయన మళ్ళీ వెంటనే విరూపాక్ష సినిమాతో బ్యాక్ బౌన్స్ అయి ప్రాపర్టీని నైజం ఏరియాలో బాగానే సంపాదించుకున్నారు.

ఇక గతంలో కూడా దిల్ రాజు ఇదే తరహాలో కొన్ని చిత్రాలతో నష్టాలు మిగిలిచుకున్న వెంటనే బ్యాక్ బోన్స్ అయ్యారు. ఆమధ్య థాంక్యూ సినిమాతో కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చుకున్న దిల్ రాజు నటించిన ఆ వెంటనే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో మంచి లాభాలను అందుకున్నారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమా లకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా చేసి దారుణంగా నష్టాలను చవిచూశారు. కానీ బాహుబలి-2 సినిమా ద్వారా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా భారీ లాభాలనే అందుకున్నారు. అలా కేవలం దిల్ రాజుకు మాత్రమే ఇందులో సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: