హిరణ్య కశపు.. సినిమా కూడా గుణశేఖర్ అన్ని కోట్ల..!!

Divya
డైరెక్టర్ గుణశేఖర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు.. అయితే ఈ ఏడాది ఈయన దర్శకత్వం నుంచి విడుదలైన చిత్రం శాకుంతలం. ఇందులో సమంత మెయిన్ పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో ఈ సినిమా చాలా మేరకు నష్టాలు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డైరెక్టర్ గుణశేఖర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రూ.40 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టక మధ్యలో దిల్ రాజు కలిసి బడ్జెట్ పెంచి రూ.54 కోట్ల రూపాయలకు చేర్చడం జరిగింది.

త్రీడీలో విడుదల చేసేందుకే మరొక రూ .10 కోట్లను ఖర్చు చేసినట్లుగా సమాచారం. దీంతో ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.64 కోట్ల రూపాయలు అన్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాపై బయ్యర్లకు పెద్దగా నమ్మకం లేకపోవడం వల్ల ఈ సినిమాని పెద్దగా ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదట. నాన్ థియేటర్స్ అన్ని కలుపుకొని  రూ.40 కోట్ల రూపాయల వరకు రికవరీ అయినట్లుగా సమాచారం. మరో  రూ.24 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 5 రోజులలో కేవలం రూ .8 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం దీంతో దాదాపుగా రూ .14 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శాకుంతలం సినిమాతో డైరెక్టర్ గుణశేఖర్ కు పెద్దగా ఊరట లభించలేదు.. తన తదుపరిచిత్రం హిరణ్యకశివు అనే చిత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.5 సంవత్సరాల క్రితమే ఈ సినిమా స్క్రిప్టును కూడా పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపుగా ఈ సినిమాకి కూడా రూ .300 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు కానీ అందుకు తగ్గ నిర్మాతల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రానా ఈ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏ మేరకు ఈ సినిమా తెరకెక్కించి విజయాన్ని అందుకుంటారు చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: