ప్రభాస్, సూర్య కాంబోలో భారీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పినక్కర్లేదు. ఇప్పటివరకు వివాదాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న ఈ హీరోకు మన తెలుగులో భారీ క్రేజ్ ఉంది. సూర్య సినిమాలకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ కోలీవుడ్ హీరో ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు లేటెస్ట్గా టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్. బాహుబలి తర్వాత డార్లింగ్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కోలీవుడ్ హీరో సూర్య, టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రాబోతుందట. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' లాంటి మల్టీస్టారర్ లో నటించారు. ఇప్పుడు ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరికొన్ని మల్టీ స్టార్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ప్రభాస్ - సూర్యల కాంబో లో కూడా ఓ మల్టీస్టారర్ ఉండబోతుంది. అయితే ఈ మల్టీస్టారర్ ని కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురగదాస్ డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మురగదాస్ ప్లాపుల్లో ఉన్నారు.

ఆయన మార్కెట్ కూడా బాగా డౌన్ స్టేజ్ లో ఉంది. ఇలాంటి సిచువేషన్ లో ప్రభాస్, సూర్య కాంబోలో మల్టీస్టారర్ సినిమా వస్తుందా? ఒకవేళ అది వస్తే హిట్ అవుతుందా? అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్లో మల్టీస్టారర్ కనుక వస్తే ఇండియా వైడ్ గా ఈ మల్టీస్టారర్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.సినిమా కనుక వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుందని చెబుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు వేచి చూడక తప్పదు. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమా షూటింగ్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. అటు ప్రభాస్ ప్రాజెక్టుకే, సలార్ షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: