Puspa -2: సాయి పల్లవి పై వస్తున్న వార్తలు నిజమేనా..?

Divya
పుష్ప సినిమా తర్వాత అప్పటివరకు కేవలం స్టైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్ ఒక్కసారిగా ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాలీవుడ్లో అత్యధికంగా రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పైన కూడా మరొకసారి ఎక్కువ దృష్టి పెట్టారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో ఏర్పాటు చేయబోతున్నారు.
మొదటి భాగాన్ని మించిపోయి రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. అంతే కాకుండా రెండో భాగంలో కొంతమంది కొత్త నటులను తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక తో పాటు సాయి పల్లవి కూడా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే లేడీ పవర్ స్టార్ బిరుదు కూడా ఈ మధ్య రావడంతో ఐకాన్ స్టార్ తో లేడీ పవర్ స్టార్ నటించబోతోంది అంటూ పెద్ద ఎత్తున టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం ప్రచారాలే తప్ప ఇందులో నిజం ఏమి లేదని తెలుస్తున్నది.
ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తుందనే వార్తలలో ఎలాంటి నిజం లేదని కేవలం ఇదంతా ప్రచారం కోసమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సాయి పల్లవినీ అసలు ఈ సినిమా యూనిట్ కూడా సంప్రదించలేదు.. సుకుమార్ మాత్రం చాలా శ్రద్ధ పెట్టి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండో భాగంలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోని ఈ సినిమాని నిర్మిస్తున్నారు సుకుమారికి సంబంధించిన నిర్మాణ సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: