SSMB28: మరోసారి స్క్రిప్ట్ లో భారీ మార్పులు సూచించిన మహేష్.. షాక్ లో త్రివిక్రమ్..?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'SSMB28' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఫాన్స్ అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కి మధ్యలో బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తాజాగా మూవీ టీం ఫిక్స్ అయిందట. అయితే ఈ నిర్ణయం మాత్రం మహేష్ బాబుదే అయినా త్రివిక్రమ్ కూడా ఫ్లాష్ బ్యాక్ లో మార్పులకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 

అయితే ఇప్పటికే చాలావరకు షూటింగ్ పెండింగ్లో ఉంటే ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే మిగతా షూటింగ్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ ఈ విషయంలో నిరుత్సాహపడుతున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం షూటింగ్ ఎటువంటి బ్రేక్ లేకుండా స్క్రిప్ట్ వర్క్ చేస్తారట. ఈ క్రమంలోనే ముందుగా యాక్షన్స్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం పీటర్ హెయిన్స్ ని రంగంలోకి దించారు. త్వరలోనే ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ని త్రివిక్రమ్ షూట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఫుల్ మాస్ ఎంటర్టైర్ గా ఈ మూవీ ఉండబోతోంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కేసరికి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలను మించే విధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని ఇదే ఏడాది ఆగస్టు 11న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: