మంచు మనోజ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెటిజన్స్...!!

murali krishna
ఇటీవల కాలంలో మంచు హీరోలు అయిన మోహన్ బాబు మరియు విష్ణు నటించిన సినిమాలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ అయితే తప్పడం లేదు. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా మరియు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా లు కూడా కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా నమోదు చేయలేక పోయాయి.
అందుకు కారణం సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్స్ అంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు ల యొక్క సినిమాలు అంటే జనాలు అస్సలు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. కానీ మంచు వారి ఫ్యామిలీకి చెందిన మనోజ్ యొక్క సినిమాల గురించి ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారటా. గత నాలుగైదు సంవత్సరాల నుండి మంచు మనోజ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తుంది. వైవాహిక జీవితం లో గొడవల కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఎట్టకేలకు మరో వివాహం చేసుకొని కొత్త జీవితం లోకి అయితే అడుగు పెట్టాడు.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం లో శ్రీవారిని దర్శించుకున్న మంచి మనోజ్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ లో తన ప్రయాణం ఎక్కడ అయితే నేను ఆపేశానో అక్కడ నుండి మళ్ళీ మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు. మంచు విష్ణు మరియు మోహన్ బాబు లకు ఎదురైన సోషల్ మీడియా ఇబ్బంది మనోజ్ కి ఎదురు కాబోదు అంటూ కూడా చాలా మంది సోషల్ మీడియా ద్వారా అయితే హామీ ఇస్తున్నారు. వారిద్దరితో పోలిస్తే మంచు మనోజ్ చాలా ఉత్తమమైన వ్యక్తి అంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయనకు ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ఇబ్బంది కలగదని ఆయన నుండి మంచి సినిమాలు వస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కూడా నెటిజెన్స్ చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: