జబర్దస్త్ వర్ష ను దారుణంగా అవమానించిన హైపర్ ఆది..!?

Anilkumar
గత కొంతకాలంగా జబర్దస్త్ నుండి ఒక్కొక్కరుగా వెళ్లిపోవడంతో జబర్దస్త్ కళ కోల్పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ పైనే పూర్తి ఫోకస్ ని పెడుతుంది. అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ దూసుకుపోతుంది. ఈ షో మొదలుపెట్టిన సమయంలో సుడిగాలి సుదీర్ షో కి యాంకర్ గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక కొన్నాళ్ళకి మల్లెమాలకి దూరమయ్యాడు సుడిగాలి సుదీర్. అనంతరం హైపర్ ఆదిని సీన్లోకి దింపారు మల్లెమాల. హైపర్ ఆది రష్మి గౌతమ్ నేతృత్వంలో శ్రీదేవి డ్రామా కంపెనీ దూసుకుపోతుంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఈ ఈ షో కి సంబంధించిన ఒక ప్రోమో ని విడుదల చేయడం జరిగింది.

ఇందులో భాగంగానే ఈ ఎపిసోడ్ లో ఆర్ కృష్ణ కళాకారులను పిలిపించి పాటలను పాటించారు. ఇక ఇందులో భాగంగానే వర్షా కూడా ఒక స్కిట్ లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ నన్ను బట్టి ఒక స్టార్ ప్రొడ్యూసర్ 100 కోట్లతో సినిమా తీస్తాను అని అన్నాడు అంటూ ఒక డైలాగ్ చెప్పింది వర్ష. ఈ క్రమంలోనే వర్ష చెప్పిన డైలాగ్ కి వెంటనే హైపర్ ఆది ఒక కౌంటర్ ను ఇవ్వడం జరిగింది. నీ మొహానికి మేనేజర్ 10,000 ఇవ్వడమే గొప్ప అలాంటిది వంద కోట్లు పెట్టి ఎవడా సినిమా తీస్తున్నాడు అంటూ చెప్పాడు హైపర్ ఆది .అనంతరం వర్ష మళ్ళీ మాట్లాడుతూ ఆ పిల్ల జమిందార్ నా బొమ్మకు కోటి రూపాయలు ఇస్తా అన్నాడు అంటూ చెప్పుకొచ్చింది.

వెంటనే మళ్ళీ హైపర్ ఆది ఈ కోతి బొమ్మకు అన్ని కోట్ల అంటూ గట్టి కౌంటర్ ను ఇస్తాడు హైపర్ ఆది. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ వాదన అందరికీ నవ్వులు తెప్పించింది. ఈ క్రమంలోని ఈ ఎపిసోడ్ లో ఒక ఎమోషన్స్ ఎన్ని కూడా ట్రై చేయడం మనం చూడొచ్చు. ఆఖరిలో యాంకర్ రష్మీ ఒకవేళ ఇమాన్యుల్ చనిపోతే వర్ష ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చేసి చూపించాలని అడుగుతుంది. అనంతరం ఇమాన్యుల్ శవంలాగా స్టేజ్ పై పడుకుంటారు .తర్వాత వర్షం వచ్చి చాలా పెద్దగా ఏడుస్తుంది ఎవరైనా ఉన్నారా కాపాడండి అంటూ గట్టిగట్టుగా అరుస్తుంది ఇందులో వర్ష నటనకు అందరూ షాక్ అవుతారు..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: