మెగా హీరో వరుణ్ తేజ్ అందరిలా కాకుండా డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు మెగా. ఇక ఈ యంగ్ హీరో తాజాగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇంకా పేరు కంఫర్మ్ కాని ఈ సినిమా VT13గా ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా మాజీ ప్రపంచ సుందరి నటించనుందని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ మూవీ టీం ఓ వీడియోని విడుదల చేసింది.ఈ సినిమాలో మాజీ మిస్ వరల్డ్ అయిన మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించనుందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాలో మానుషి ఓ ఆఫీసర్ పాత్రలో అలరించనుంది.
ఇక ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ..''ఇంత గొప్ప సినిమాలో నేనూ ఒక భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో చాలా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీ స్క్రిప్ట్ చదివాక మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువైంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్కు ధన్యవాదాలు.వరుణ్తో కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని తెలిపింది. అందుకు వరుణ్ కూడా ఆమెకు వెల్కమ్ చెబుతూ ట్వీట్ చేశాడు.ఇక భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుండగా.. మానుషి చిల్లర్ తెలుగు తెరకు పరిచయమవ్వనుంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను ఈ సినిమాలో చూపనున్నారు.ఇక తెలుగు, హిందీ భాషల్లో రానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే.రీసెంట్ గా వరుణ్ తేజ్ f3 తో ప్లాప్ ని అందుకోగా మానుషి పృథ్వీ రాజ్ చౌహాన్ సినిమాతో ప్లాప్ ని మూటగట్టుకుంది.చూడాలి ఈ సినిమా వీరి ఇద్దరికీ ఎలాంటి విజయాన్ని ఇస్తుందో.