ట్రోల్ల్స్ కి గురవుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్స్ లలో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రెసెంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక మూవీ చేస్తున్న అందరికి సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` అనే వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా చేస్తున్నారు.
ప్రెసెంట్ హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే ఈ విషయాలను పక్కన పెడితే  గత రెండు రోజుల నుంచి త్రివిక్రమ్, పూజా హెగ్డేలకు సంబంధించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే లేటెస్ట్ గా  బుట్టబొమ్మకు త్రివిక్రమ్ పర్సనల్ గా రెండు కోట్ల రూపాయిలు విలువ చేసే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చడని తెలుస్తుంది. ప్రెసెంట్ ఐతే ఆ కారులోనే పూజా హెగ్డే షూటింగ్ కు వస్తోందని ప్రచారం జరుగుతోంది.ఐతే దీంతో కొందరు పని గట్టుకుని మరీ త్రివిక్రమ్ ను సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఐతే ఇక్కడే అసలు కథ వేరే ఉందని ఇంకొంతమంది భావిస్తున్నారు. వాళ్ళ ప్రకారం త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసే సినిమాలకు సంబంధించి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పార్ట్నర్ షిప్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండు బ్యానర్లలో త్రివిక్రమ్‌ పెట్టుబడులు ఉన్నాయంటారు. ఇక ఈ ప్రొడక్షన్స్‌లో చేసే సినిమాలకు సంబంధించి హీరోయిన్లను సెట్స్‌కి తీసుకురావడానికి, మళ్లీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక తీసుకెళ్లి హోటల్స్‌లో దింపడానికి  అద్దె కార్లు అయితే భారీగా ఖర్చు అవుతుందట. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ తరపున రూ. 2 కోట్లు పెట్టి ఒక లగ్జరీ కారుని కొనుగోలు చేశారట. అంతేగానీ పూజా హెగ్డేకు త్రివిక్రమ్ ఎలాంటి కారు గిఫ్ట్ గా ఇవ్వలేదని తెలుస్తోంది. కావాలనే త్రివిక్రమ్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు అంటున్నారు.
ఇవన్నీ సోషల్ మీడియా లో సహజమేనని ఇలాంటి వాటికీ త్రివిక్రమ్ గారు రెస్పాండ్ అవ్వరు అని ఆయన అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: