ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్...!!

murali krishna
ఎన్టీఆర్ తన తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎన్నో ఆటంకాలు ఎదురైన విషయం తెలిసిందే.
ఈ సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఈమె ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. మార్చి 6వ తేదీన ఈ సినిమా నుంచి భారీ సర్ప్రైజ్ రానుందని కూడా సమాచారం అందుతోంది.
మార్చి నెలలో ఈ సినిమా కు సంబంధించి వరుస సర్ప్రైజ్ లు  అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మిస్తుండ గా మార్చి 6వ తేదీన జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడం తో ఆరోజే జాన్వీ ఈ సినిమా లో నటిస్తున్నట్టు అధికారికం గా ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ కొరటాల కాంబోలో ఈ సినిమా వస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించి జాన్వీకి టెస్ట్ షూట్ కూడా పూర్తైందని తెలుస్తుంది.. మార్చి నెల మూడో వారంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం.మార్చి నెల చివరి వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కానుందని సమాచారం.. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఎన్టీఆర్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చెప్పారని ఎన్టీఆర్ చెప్పిన మార్పులకు అన్గుణంగా నే ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం విశేషం.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలోని సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: