మగధీర రీరిలీజ్: మహేష్, పవన్ రికార్డులు బ్రేక్ అవుతాయా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన "మగధీర" సినిమా 2009 జులై 31వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక ఈ సూపర్ డూపర్ హిట్టు సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మరోసారి కాల భైరవ మిత్రవిందల ప్రేమ కథను థియేటర్లలో చూసేందుకు మెగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా రీరిలీజ్ గురించి తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ చేస్తున్నారు.ఇక అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. స్టార్ నటుడు శ్రీహరి కీలక పాత్రలో నటించి ఎంతగానో మెప్పించారు. ఈ సినిమాకు కూడా కథను డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు.


అలాగే ఎం రత్నం మాటలు రాశారు. అలాగే అప్పట్లో ఆల్ టైం హిట్టుగా నిలిచిన పాటలను భువన చంద్ర చంద్రబోస్ కీరవాణిలు సమకూర్చారు.మగధీర సినిమా 13 ఏళ్ల కిందనే ఏకంగా 40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. టోటల్ గా ఈ సినిమా రూ.77.96 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఈ సినిమా బయ్యర్లకు 37.54 కోట్ల భారీ లాభాలను కూడా అందించింది.ఇక మరోసారి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీం అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెండో సారి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ మేర వసూలు చేస్తుంది ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుంది వంటి విషయాలు తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. ఈ సినిమాతో రీ రిలీజ్ తో రామ్ చరణ్  సూపర్ స్టార్ మహేష్ పోకిరి, ఒక్కడు, దూకుడు ఇంకా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా రికార్డులని బద్దలు కొడతాడో లేడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: