ఆ యంగ్ హీరోతో జోడి కడుతున్న కృతి శెట్టి..!?

Anilkumar
ఉప్పెన  సినిమాతో యువతరాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న మంగళూరు సోయగం కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది ఈమె. ఈ ఒక్క సినిమాతో తనకంటూ స్టార్ హీరోయిన్గా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా అనంతరం అప్పట్లో వరుస సినిమాలు చేసింది కృతి శెట్టి. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈమె వరుసు సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో టాలీవుడ్ లో ఈమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఇకపోతే ఉప్పెన హీరోయిన్ కి పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి. కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దింతో తన తర్వాతే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు కథల ఎంపికల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది అని తెలుస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె శర్వానంద్ తో జోడి కట్టబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.

దీంతో మొదటిసారి వీరిద్దరూ జోడిగా కనిపించబోతున్నారని తెలిసిన వీరి అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమైందని అంటున్నారు. అంతే కాదు త్వరలోనే కృతి శెట్టి కూడా షూటింగ్లో పాల్గొనబోతోందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో కృతి శెట్టి కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: