'ఆదిపురుష్' కోసం 'సలార్' ని సైడ్ చేసిన ప్రభాస్..?

Anilkumar
పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఫాన్స్ తో పాటు ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా డార్లింగ్ ఫాన్స్ మేకర్స్ నుంచి అప్డేట్ రాలేదంటే వారికి చుక్కలు చూపడం గ్యారెంటీ. ఆది పురుష్ మూవీ విషయంలో ఇదే జరిగింది. అప్డేట్స్ విషయంలో ఆది పురుష్ టీం ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇన్నీ కావు. అయితే ఇటీవల విడుదల చేసిన టీజర్ తీవ్ర విమర్శలు ఎదురుకోగా ఇప్పుడు ఆదిపురుష్  డామేజ్ కి బ్రేక్ చేయడానికి మన ప్రభాస్ రంగంలోకి దిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆదిపురిష్ తోపాటు సలార్ ప్రాజెక్టుకి రాజా డీలక్స్.

అయితే వీటిలో ఫాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న మూవీ సలార్. ఎందుకంటే కేజీఎఫ్తో వండర్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నిల్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అదే ఆదిపుష్ టీమ్ కి శాపంగా మారింది. ఆది పురుష్ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఈ సినిమాని జూన్ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఫాన్స్ లో మాత్రం ఈ సినిమాపై ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే టీజర్ విడుదల చేసినప్పుడు ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి సమయంలో సలార్ అప్డేట్ బయటికి వస్తే ఆది పురుష్ మూవీ విషయాన్ని మర్చిపోతారు ఫ్యాన్స్.

అందుకే ఆది పురుష్ విడుదల అయ్యే వరకు సలార్ అప్డేట్స్ ని హోల్డ్ లో పెట్టాలని ప్రభాస్ మూవీ టీం కి సూచనలు ఇచ్చారట.కాగా అటు డైరెక్టర్ ఓం రౌత్ ఇప్పటికే ఆది పురుష్ సినిమాలో చేయాల్సిన మార్పులన్నీ చేసి సినిమాకి న్యూ టచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కూడా ప్రస్తుతం ఆది పురుష్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడట. ఒకవేళ ఈ మూవీ వర్కౌట్ ఐ బాక్సాఫీస్ వద్ద నిలబడితే ఈ మైథాలజికల్ మూవీ కాబట్టి కచ్చితంగా భారీ కలెక్షన్స్ రావడం ఖాయం. అందుకే ఆది పురుష కోసం సలార్ నీ సైడ్ చేస్తున్నడట ప్రభాస్. ఈ విషయంలో ఫ్యాన్స్ మాత్రం హార్ట్ అవుతున్నా ఆదిపురుష్ పై బజ్ క్రియేట్ చేయడానికే డార్లింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: