అన్ని కోట్లు ఖర్చుచేసి కియారాకి పెళ్లి గిఫ్ట్ ఇచ్చిన సిద్దార్థ్..ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బాలీవుడ్ సిని ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సిద్ధార్థ మల్హోత్రా మరియు కియార అద్వాని. ఎంతోకాలంగా ప్రేమలో ఉన్న ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మీర్ లోని సూర్యగట్ ప్యాలెన్స్ లో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహ మహోత్సవం జరిగింది. అతి తక్కువ కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరిద్దరికి సంబంధించిన రిసెప్షన్ కూడా ఇటీవల చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ కి పెళ్లికి హాజరు కాని చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చి సందడి చేయడం జరిగింది. 

అయితే పెళ్లి అనంతరం ఉత్తమ నివాసానికి కియారాతో కలిసి వెళ్లారు సిద్ధార్థ మల్హోత్రా.ఇక అక్కడే వీరిద్దరి రిసెప్షన్ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలోని ఇంత దూరం రాలేని చాలామంది సినీ తారల కోసం ఆదివారం ముంబైలో మరోసారి రిసెప్షన్ను కూడా ఏర్పాటు చేశారు బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ మల్హోత్రా మరియు కియార అద్వాని. అయితే వీరి పెళ్లి కాకముందు నుండి వీరిద్దరికి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నవ దంపతులకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతుంది.

అయితే పెళ్లి తర్వాత సిద్ధార్థ మల్హోత్రా కియారా అద్వానితో కలిసి ఉండేందుకు ఒక ఖరీదైన ప్లాట్ ను కొనుగోలు చేసినట్లుగా సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వెలబడుతున్నాయి.ఈ  నేపథ్యంలోనే ముంబైలోని పాళీ ప్రాంతంలో బీచ్ వ్యూతో ఉన్న ఒక భవనంలో ఒక అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసి కీరా అద్వానికి సిద్ధార్థ మల్హోత్రా బహుమతిగా ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్లాట్ కి సిద్ధార్థ మల్హోత్రా పెట్టిన ఖర్చు ఇప్పుడు హాట్ టాప్ గా మారింది. ఇక ఆ ఇంటి విలువ దాదాపు 70 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.అయితే దాదాపు 70 కోట్లు ఖర్చు చేసి పెళ్లి తర్వాత కియారా అద్వానీకి ఈ రేంజ్ లో గిఫ్ట్ ఇవ్వడంతో అందరూ ఒకేసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వేర్లు అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: