రాడ్డు లాంటి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో ప్రభాస్ మరో మూవీ?
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ప్లాప్ గా నిలవడమే కాకుండా ప్రభాస్ కెరీర్ కే మాయని మచ్చలా మారింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని ఓ నైట్ మేర్ లా భావిస్తారు.ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్లని కూడా రాబట్టలేకపోయింది.అత్యధిక బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా బుల్లి తెర, ఓటీటీలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఓన్లీ పాటలు, విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ ఇప్పటి దాకా కొత్త మూవీపై ఎలాంటి ప్రకటన చేయలేదు.సహజంగా అయితే ఒక ఫ్లాప్ ఇచ్చిన తర్వాత మరోసారి ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వడం అంటే సులభమైన విషయం కాదు. కానీ ప్రభాస్ మాత్రం రాధాకృష్ణపై ఉన్న నమ్మకంతో అతనికి మరో ఛాన్స్ ఇచ్చారని సమాచారం తెలుస్తోంది.
అయితే ఈసారి రాధా కృష్ణ డైరెక్ట్ చేయబోతున్న మూవీలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించడం లేదు. గోపీచంద్తో తెరకెక్కించే మూవీని ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో గోపిచంద్ హీరోగా జిల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే రాధాకృష్ణ టాలీవుడ్ లో దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. అయితే రాధేశ్యామ్ వంటి రాడ్డు ఫ్లాప్ తర్వాత కూడా ప్రభాస్ మరోసారి ఇతనికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.ఇదిలా ఉంటే గోపిచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ విడుదల తర్వాత రాధాకృష్ణ మూవీలో గోపి జాయిన్ కానున్నారు.