నాగచైతన్య, శోభిత ప్రేమ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అక్కినేని ఫ్యామిలీ..!?

Anilkumar
గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల ప్రేమలో ఉన్నారు అని రకరకాల వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాదు చాలామంది వీరిద్దరూ ఏకంగా సహజీవనం చేస్తున్నారు అంటూ అప్పటిలో జోరుగా ప్రచారాలు కూడా చేశారు. అంతేకాదు ముంబైలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో వీరిద్దరూ ఒక ప్లాట్ తీసుకొని అందులో కలిసి ఉంటున్నారు అని కూడా అన్నారు. అంతేకాదు షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే నాగచైతన్య హైదరాబాద్ కి వచ్చి తిరిగి ముంబై వెళ్లాడని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నాగచైతన్య వర్సెస్ సినిమాల పనిలో బిజీగా ఉన్నాడు. 

ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. అయితే నాగచైతన్య సమంత నుండి విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోదేమో అని అందరూ భావించారు.కానీ చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించిన విధంగా శోభితతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు చాలామంది అక్కినేని అభిమానులు ఈ ప్రేమ విషయం ఉట్టి పుకార్లే అని కొట్టిపాడేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన మరొక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికదా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని కుటుంబం శోభిత దూళి పాలని తమ కుటుంబంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

దీంతో ఈ వార్త విన్న అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఇందులో నిజం ఎంతుంది అన్నది తెలియాల్సి ఉంది.ఈ నేపథ్యంలోనే అందుతున్న సమాచారం ప్రకారం శోభిత ప్రేమ వ్యవహారాన్ని నాగచైతన్య మరియు శోభిత ఇరు కుటుంబాలకి చెప్పారట. సమంతతో విడాకుల తరువాత నాగచైతన్య పెళ్లి చేసుకోదేమో అని అందరూ భావిస్తున్న తరుణంలో నాగచైతన్య శోభితతో పెళ్లికి రెడీ అవ్వడంతో ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా ఓకే చేశారని తెలుస్తోంది. అక్కినేని కుటుంబంతో పాటు శోభిత కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: