ఇండియన్ టాప్ హీరోల్లో ఒక్కడిగా ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా పేరున్న ప్రభాస్ పెళ్లిపీటలెక్కనున్నాడా? తన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ లో ప్రభాస్ కి జోడిగా నటించిన కృతి సనన్తో మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్కు రెడీ అయ్యాడా?ఇక ఇలా గత రెండు రోజుల నుంచి ప్రభాస్ నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతూ తెగ షికార్లు చేశాయి. అసలు దీనికి ఫస్ట్ బాలీవుడ్ చెత్త ఫిల్మ్ క్రిటిక్ గా పిలవబడే ఉమైర్ సంధు ఈ రూమర్లకు బీజం వేశాడు. 'ఇక ప్రభాస్ కి కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది. అయితే అదీ ఇండియా లో మాత్రం కాదు, మాల్దీవ్స్ అని ఓ పోస్ట్ పెట్టాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ పట్ల నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నా' అని అతడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారింది. ప్రభాస్ అభిమానులు అయితే ఈ పోస్ట్ చూసి నిజమో, అబద్ధమో తెలియక ఫుల్ గా గందరగోళంలో పడిపోయారు. అయితే ఎట్టకేలకు తమ ఎంగేజ్మెంట్ వార్తలపై ఈ జోడి స్పందించింది. ముందుగా ఈ విషయం పై ప్రభాస్ పీఆర్ టీమ్ స్పందించింది. ' ప్రభాస్, కృతి సనన్ చాలా మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరికీ ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న వార్తల్లో అసలు ఏమాత్రం నిజం లేదు' అని కుండ బద్ధలు కొట్టింది. అటు ప్రభాస్ సహనటులు ఇంకా అలాగే స్నేహితులు కూడా ఈ వార్తలను కొట్టిపారేశారు.
ఇక కృతి సనన్ టీం కూడా ఈ వార్తలపై స్పందించడం జరిగింది.ప్రభాస్తో ఎంగేజ్మెంట్ అనేది వట్టి పుకారేనని క్లారిటీ ఇచ్చింది.ప్రభాస్ ఇంకా కృతి సనన్ జంటగా 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కుతోంది. రామాయణం కథ ఆధారంగా ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో కృతి, ఇంకా రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఎప్పుడైతే ఆదిపురుష్ సినిమా సెట్స్పైకి వెళ్లిందో.. అప్పటి నుంచి కూడా ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి తోడు భేడియా ప్రమోషన్స్లో కూడా హీరో వరుణ్ ధావన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రభాస్- కృతి సనన్ల డేటింగ్ రూమర్లకు ఆజ్యం పోశాయి. ఆ సమయంలో దీపికా పదుకొనేతో షూటింగ్లో ఉన్న ఓ హీరో మనసులో కృతి సనన్ పేరు ఉందంటూ సరదాగా వరుణ్ దావన్ కామెంట్ చేశాడు. ఆ సమయంలో దీపికాతో ప్రాజెక్టు- కే షూటింగ్లో ఉంది ప్రభాసే కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఇక అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు. దీనిపై అప్పుడే స్పందించిన కృతి అవన్నీ పుకార్లేనని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి తనే స్వయంగా అందరికీ చెబుతానని ఆమె వివరణ ఇచ్చింది.