గుబులు పుట్టిస్తున్న దసరా రేస్ !

Seetha Sailaja
సినిమాఇండస్ట్రీకి సంక్రాంతికి వచ్చినంత కలక్షన్స్ దసరా సీజన్ లో రావు. అయితే ఆవిషయాలను పట్టించుకోకుండా దసరా సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న భారీ సినిమాల లిస్టును చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ ల మూవీ ఈ దసరా సీజన్ కు ఖచ్చితంగా రాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీకి 200 వందల కోట్ల బిజినెస్ అయిందన్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

ఇక చిరంజీవి ‘భోళా శంకర్’ కూడ దసరా కు విడుదల అవ్వాలి అన్న టార్గెట్ తో రెడీ అవుతోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి జరిగినట్లుగానే మళ్ళీ బాలకృష్ణ చిరంజీవి ల వార్ ఉంటుంది అని అంటున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మూవీని ఎట్టి పరిస్థితులలోను దసరాకు విడుదల చేయమని ఇప్పటికే బాలయ్య స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు అని అంటున్నారు. ఈముగ్గురు చాలదు అన్నట్లు రవితేజా కూడ ఈ దసరా రేస్ పై ఆశక్తి కనపరుస్తున్నాడు అని తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారంమేరకు మాస్ మహారాజా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ కూడ ఈ దసరా సమయంలోనే విడుదల అవుతుంది అన్నసంకేతాలు వస్తున్నాయి. వరస ఫ్లాప్ లతో సతమైపోతున్న విజయ్ దేవరకొండ సమంతల ‘ఖుషీ’ మూవీని కూడ ఏదోవిధంగా పూర్తి చేసి దసరా నాటికి విడుదల చేయాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  

వాస్తవానికి దసరా సంక్రాంతిలా దసరా మూడు రోజుల పండుగ కాదు. విజయదశమి మాత్రమే పండుగగా జనం పరిగణిస్తూ ఉంటారు. మిగతారోజులు పూజలు మాత్రమే కొనసాగుతూ ఉంటాయి. అయితే దసరాకు పాఠశాల లకు కాలేజీ లకు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ సెలవుల సీజన్ ను నమ్ముకుని దసరా నవరాత్రుల ప్రారంభం నుండి మొదలయ్యే 10 రోజులలో ఇన్ని సినిమాలు రావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇన్ని సినిమాలకు ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: