కొత్త బంగారు లోకం సినిమా కోసం మొదట ఆ స్టార్ హీరోని అనుకున్నారా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అందమైన ప్రేమ కథల రూపంలో సినిమాలు వచ్చాయి. కానీ ఎప్పటికీ చెప్పుకునే సినిమా పేరు అయితే కొత్త బంగారులోకం అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. టాలీవుడ్ సెన్సిబిలి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎవరు ఊహించిన విధంగా మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమాలో హీరోగా వరుణ్ సందేశ్ హీరోయిన్గా శ్వేతా బసు నటించి అందరినీ ఆకట్టుకున్నారు. టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా మంచి విజయాన్ని సైతం అందుకుంది. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పటికి ఈ సినిమా వస్తే టీవీలకే అతుక్కుపోయి ఈ సినిమాను చూస్తూ ఉంటారు. 

అంతేకాదు ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ చాలామంది ఎంతో ఉత్సాహంతో వింటూ ఉంటారు. ఈ సంగీతం ఇప్పటికీ చాలామంది శ్రోతలను అలరిస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అదేంటండి అంటే.. ఈ సినిమాలో హీరోగా ముందుగా వరుణ్ సందేశం అనుకోలేదట.  ముందుగా ఈ సినిమాలో హీరోగా ఎవరిని అనుకున్నారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.. వరుణ్ సందేశ్ మరియు శ్వేతా బసు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ముందుగా హీరోగా అక్కినేని హీరో నాగచైతన్య ని అనుకుంటున్నారట. అయితే ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు మరియు నిర్మాతలు నాగార్జునకి వినిపించారట.

దీంతో నాగార్జున మాట్లాడుతూ నాగచైతన్యను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో లాంచ్ చేయాలన్నట్లుగా ఆదర్శక నిర్మాతలతో చెప్పాడు. అంతేకాదు మాస్ స్టోరీ ఉంటేనే మీ బ్యానర్లో చేస్తామని నాగార్జున చెప్పుకొచ్చాడట. దాని అనంతరం ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన వరుణ్ సందేశ్ ని చూసి వరుణ్ని చూసి..వరుణ్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడని దిల్ రాజు భావించాడట. దిల్ రాజా భావించినందుకు గాను ఈ సినిమాలో హీరోగా వరుణ్ సందేశం ఎంపిక చేశారట. అలా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాతో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్.ఈ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా నిరాశపర్చిన సంగతి మనందరికీ తెలిసిందే ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: