100 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య?

Purushottham Vinay
ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా రోజుల తర్వాత సంక్రాంతి పండగ బరిలోకి హిట్ కొట్టాడు మెగాస్టార్‌ చిరంజీవి. పోటీగా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా చాలా స్పీడ్ గా షూటింగ్‌ పూర్తి చేసి  పొంగల్‌కు థియేటర్లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ట్రైలర్ చూసి అభిమానులు అనుకున్నట్లే ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. వింటేజ్‌ చిరంజీవిని చూసేందుకు అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు థియేటర్లని హౌస్ ఫుల్ చేస్తున్నారు. సంక్రాంతి వైబ్స్ తగ్గిపోతున్నా కూడా వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లు మాత్రం ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇందుకు తగ్గట్టే వసూళ్లలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ మూవీ. సంక్రాంతి పండుగ కానుకగా శుక్రవారం (జనవరి 13)న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమా కేవలం మూడురోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించించారు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య మెగా మాస్ బ్లాక్ బస్టర్ అని పేర్కొంటూ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

ఫస్ట్ మూడు రోజుల్లోనే ఏకంగా 108 కోట్ల గ్రాస్ రాబట్టి మెగాస్టార్ బాక్సాఫీస్ బాస్ అయ్యారని నిర్మాతలు తెలిపారు. ఏనుగుపై కూర్చొని ఉన్న చిరంజీవి కొత్త పోస్టర్ ని విడుదల చెయ్యగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అది తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ అయితే విపరీతంగా సంబరాలు చేసుకుంటున్నారు.రిలీజైన మొదటి రోజు రూ.50 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజుకి ప్రపంచవ్యాప్తంగా రూ .75.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీ్‌లో కూడా రికార్డులు కొల్లగొడుతోంది వాల్తేరు వీరయ్య. ఇప్పటి దాకా అమెరికాలో1.6 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్స్‌ను రాబట్టింది. సినిమా జోరు చూస్తుంటే వాల్తేరు వీరయ్య త్వరలోనే150 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కే.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. అలాగే హాట్ బ్యూటీ శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పెద్ద చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: