బాలకృష్ణ మూవీ కంటే చిరంజీవి సినిమాకే ఎక్కువ స్క్రీన్స్ కేటాయిస్తారా..?

Divya
మెగాస్టార్ చిరంజీవి , నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్లీ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతి బరిలో నువ్వా నేనా అన్నట్టుగా చిరంజీవి ,బాలకృష్ణ పోటీపడ్డారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలై కొంతవరకు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ రెండవ భాగంలో ప్రేక్షకులు సినిమాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు. దీంతో బోర్ గా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. ఫలితంగా బాలకృష్ణ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను బాబి డైరెక్షన్లో తెరకెక్కించగా ఈ చిత్రానికి కూడా మైత్రి మూవీ మేకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. విచిత్రం ఏమిటంటే రెండు సినిమాలలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇకపోతే సంక్రాంతి కానుకగా జనవరి 13న అంటే ఈరోజు థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చాలాకాలం తర్వాత బాస్ ఈస్ బ్యాక్ అంటూ సినీ ప్రేక్షకులు తెగ సందడి చేస్తున్నారు.  ప్రస్తుతం థియేటర్లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులతో కలకలలాడుతున్నాయి.
ఒకవేళ ఇదే కనుక మరికొద్ది రోజులు కొనసాగితే బాలయ్య వీరసింహారెడ్డి సినిమా కంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు ఎక్కువ స్క్రీన్ లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగో వాల్తేరు వీరయ్య సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఈ పండుగ పర్వదినాలలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.  దీంతో చిరంజీవి సినిమాకు ఎక్కువ థియేటర్ లు  కేటాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: