రోజ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి..!?

Anilkumar
ఇటీవల మినిస్టర్ రోజా మెగా ఫ్యామిలీ పై విమర్శలు చేయడంతో సోషల్ మీడియా వేదికగా నిలిచింది. ఇక రోజా మెగా ఫ్యామిలీ పై చేసిన విమర్శలు సోషల్ మీడియా వేదికగా ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల రోజా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ఏరోజైనా చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం ఎవరైనా చూశారా.. వాళ్ళ జేబులో నుండి ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ బయటకి తీసింది లేదు.. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి జనాలు వాళ్ళని సొంత నియోజకవర్గాలలో ఓడిస్తున్నారు అంటూ చెప్పింది రోజా.

 దీనికి మెగా అభిమానులు రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. దీంతో మెగా అభిమానులు పిల్లికి కూడా బిచ్చం పెట్టని నువ్వు మెగా బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత పదవిలో ఉన్నావు కదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే దవడ పళ్ళు రాలతాయి అంటూ సోషల్ మీడియా వేదికగా రోజాని టాగ్ చేస్తూ మెగా అభిమానులు ఒక ఆట ఆడుకున్నారు. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ నాగబాబు కూడా రోజాపై ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రోజా చేసిన కామెంట్లపై స్పందించాడు మెగాస్టార్ చిరంజీవి...పరోక్షంగా రోజాకి గట్టి విమర్శలై చేశాడు..

ఇక మెగాస్టార్ మాట్లాడుతూ.. నా పేరు వాడకపోతే వాళ్లని ఎవరూ పట్టించుకోరు.. నా పేరు వాడుకోకపోతే వాళ్లకి అసలు గుర్తింపు రాదు.. అడ్డదారిలో గుర్తింపు రావాలి అని అడ్డదిడ్డంగా నా మీద నా కుటుంబం మీద మాట్లాడితే ఒక గుర్తింపు వస్తుందని ఇలా గుర్తింపు రావాలి అని.. ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని.. సరే నావల్ల వాళ్లకి గుర్తింపు వస్తుంది అంటే ఓకే అని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. అంతేకాదు నాతోటి ఉంటూ ఇన్ని రోజులు ఇండస్ట్రీలో స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా నన్ను కామెంట్ చేస్తున్నారు.. నాకు ఉన్నదాంట్లో నేను ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను.. నేను సహాయం చేస్తున్నాను అని నిరూపించుకోవలసిన అవసరం నాకు లేదు.. నేను పబ్లిసిటీ కోసం ఎవరికి సహాయ సహకారాలను చేయను... నా సహాయం అందుకున్న వారికి నేనంటే ఏంటో తెలుసు అంటూ చెప్పవచ్చాడు చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: