క్రేజీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "కళ్యాణం కమనీయం" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో పేపర్ బాయ్ మూవీ తో హీరోగా మంచి గుర్తింపును దక్కించుకొని ... ఆ తర్వాత ఏక్ మినీ కథ మూవీ తో ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి నటుడిగా ప్రశంసలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ యువ హీరో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఫరీయ అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సంతోష్ "కళ్యాణం కమనీయం" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యువి క్రియేషన్ సంస్థ నిర్మించగా ... ప్రియ భవాని శంకర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అనిల్ కుమార్ అల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ... వాటికి మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీకి "యు" సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కేవలం ఒక గంట 46 నిమిషాల క్రేజీ రన్ టైమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: