శృతిపై చిరు సెటైర్లు.. వైరల్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఇంకా అలాగే శృతిహాసన్ నటించిన మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 13 వ తేదీన రిలీజ్ కానుంది. నిన్న విశాఖ ఆర్కే బీచ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది చాలా ఘనంగా జరిగింది.చాలా గ్రాండ్ గా చేసిన ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ఇద్దరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమా హీరోయిన్ శృతిహాసన్ మాత్రం ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. అయితే శృతికి జ్వరం వచ్చిందని..కరోనా టెస్టు కూడా చేయించుకున్నానని నిన్న శృతిహాసన్ సోషల్ మీడయాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రెండు రోజుల క్రితం నందమూరి నటసింహం బాలయ్య వీరసింహారెడ్డి ఫంక్షన్ కు వచ్చి వాల్తేరు వీరయ్య సినిమాకు అటెండ్ కాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న వేదికపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ రాకపోవడంపై సెటైర్లు వేశారు.ఆ సెటైర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


' ఇక ఆ అమ్మాయి శృతిహాసన్.. మరి ఒంగోలులో ఏం తిన్నదో తెలీదు తనకు జ్వరం వచ్చిందంట.. లేక ఎవరైనా బెదిరించారో తెలీదు. ఫోన్ చేసి తనకు జ్వరం వచ్చింది ఇంకా కొవిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నా సారీ సార్ అంటూ చెప్పింది. ఈ సినిమాలో శృతిహాసన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. గ్లామర్ తో పాటు ఇంకా యాక్షన్ సీన్ లో కూడా చాలా బాగా చేసింది. ఆమె మైనస్ 8 డిగ్రీల ఉష్గోగ్రతలో కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేసింది. ఇక శృతిహాసన్ ప్రొఫెషనలిజానికి హ్యాట్సాప్ '' అంటూ చిరు కామెంట్స్ చేశారు.ఇక ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ కనిపించబోతున్నారు. అలాగే ఇందులో కేథరిన్, బాబీ సింహా ఇంకా నాజర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ కంపెనీ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈమధ్యే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అందరినీ చాలా ఆకట్టుకునేలా ఉంది. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై చాలా భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: