ఎన్టీఆర్‌తో జోడీగా జాన్వీ.! ఎట్టకేలకు ఇదే ఫైనల్.....!!

murali krishna
పలువురు స్టార్ దర్శకులు తెలుగులో టాప్ హీరోల సరసన జాన్వీని ఫిమేల్ లీడ్‌గా తీసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. చివరకు కొరటాల- ఎన్టీఆర్ కాంబో సినిమాకు సెట్టయిందట జాన్వీ.
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ జోడీగా టాలీవుడ్ గడప తొక్కబోతోందట జాన్వీ కపూర్. ఈ మేరకు కొరటాల టీమ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఇన్ సైడ్ టాక్.
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వార్తలు వస్తూనే ఉంటాయి కానీ ఇప్పటిదాకా జాన్విని తెలుగు తెరపై చూసింది లేదు. సౌత్ సినిమాలపై తనకు ఇంట్రస్ట్ ఉందని చెబుతున్న జాన్వీ కపూర్.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కుతున్నా రిజెక్ట్ చేస్తూ వస్తోందట.
ఈ నేపథ్యంలో తన కథతో ఆమెను మెప్పించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva), జాన్వీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది. తొలుత కాస్త ఆలోచించిన జాన్వీ.. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయిందట.
పలువురు స్టార్ దర్శకులు తెలుగులో టాప్ హీరోల సరసన జాన్వీని ఫిమేల్ లీడ్‌గా తీసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. చివరకు కొరటాల- ఎన్టీఆర్ కాంబో సినిమాకు సెట్టయిందట జాన్వీ.
జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా నటించేందుకు ఆసక్తిగా ఉందని గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పిన జాన్వీ.. ntr 30 సినిమాలో భాగం కావడానికి డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మరీ సిద్దమైందట. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా సెట్స్ పై జాన్వీ కలరింగ్ ఉండబోతుందనేది లేటెస్ట్ టాక్.
రీసెంట్‌గా rrr రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకొని ఇప్పుడు కొరటాల ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీని ఎంపిక చేశారనే విషయం నందమూరి అభిమానులను సైతం ఖుషీ చేస్తోంది.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, ఇందుకోసం సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్- సాయి పల్లవి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారని, ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్పులతో థియేటర్స్ హోరెత్తిపోయేలా కొరటాల ప్లాన్ రెడీ చేశారని సమాచారం.
గతంలో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచి ఈ మూవీ అప్‌డేట్స్ వేట మొదలుపెట్టారు.
పొలిటికల్ టచ్‌తో రాబోతున్న ఈ కథ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ కావాలని కొరటాల బలంగా ఫిక్సయ్యారట. యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాల‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: