మసూద: ఓటిటి విడుదలకి రెడీ?

Purushottham Vinay
ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా బాగా నడుస్తోంది. తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రాలు చాలా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇంకా అంతే కాదు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతున్నాయి.కార్తికేయ2 ఇంకా కాంతారా చిత్రాలు దానికి ఉదాహరణలు. ఇక ఇప్పుడు మరో చిత్రం కూడా ఈ లిస్ట్ లో చేరింది. అదే మసూద. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'మళ్ళీ రావా', థ్రిల్లర్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వచ్చింది ఈ మసూద సినిమా. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్ ఇంకా అలాగే సత్యం వంటి రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ సినిమాతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా నవంబర్ 18 వ తేదీన  ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.


మంచి హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించింది కావ్య.ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమాని 'ఆహా' భారీ ధరకి కొనుగోలు చేసిందని.. డిసెంబరు 16 లేదా 23న స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు ప్రచారం అనేది జరుగుతోంది. డిసెంబర్ 16 వ తేదీన అవతార్2 సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అదే రోజు మసూదా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలో దీని పై క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: