SSMB28: అంతా సెట్ అయినట్టేనా? కానట్టా?

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ అండ్ టీమ్ ఇప్పుడు దుబాయ్‌లో ఉంది. సినిమాకు వర్క్ చేసే టాప్ టెక్నీషియన్స్ ఇంకా అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అక్కడకు వెళుతున్నారట. ఇప్పుడు మరోసారి టీమ్ అందరికీ త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ ఇచ్చారని సమాచారం తెలిసింది. ముందుగా అనుకున్న కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఇంకా అలాగే మహేష్ కథ మార్చమని అడిగినట్టు, షూటింగ్ ఆపేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక వాటికి ఈ మీటింగ్‌తో అయిన ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.నిజం చెప్పాలంటే... మహేష్, త్రివిక్రమ్ మధ్య కథ విషయంలో అభిప్రాయ భేదాల వల్ల షూటింగ్ అయితే ఏమి ఆగలేదు. ఇటీవల మహేష్ తండ్రి కృష్ణ గారు కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి గారి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, అందువల్ల వాయిదా పడుతోందని వార్తలు కూడా వస్తున్నాయి.


అలాగే పూజాని త్రివిక్రమ్ ఈ సినిమా నుంచి తొలగించాడని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అది నిజం కాదని తెలిసింది.ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. అందులో బస్ ఫైట్ ని తీశారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం తెలుస్తుంది. నలభై ఐదు రోజులు పాటి ఏకధాటిగా ఆ షెడ్యూల్ అనేది జరుగుతుందని, అందులో మెజారిటీ సీన్స్ అండ్ ఫైట్స్ పూర్తి చేస్తారని సమాచారం తెలుస్తుంది.ఇక తమన్ ఈ సినిమాకు సంగీతంని అందిస్తున్నారు. అయితే... అతడు వద్దని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వచ్చినట్టు ఆ మధ్య సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇక అప్పుడే ఈ పుకార్లకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఆల్రెడీ తమన్ మూడు ట్యూన్స్ ని కూడా ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు అతడు కూడా దుబాయ్ వెళ్ళారు. మిగతా పాటలు ఇంకా అలాగే నేపథ్య సంగీతం విషయంలో సిట్టింగ్స్ అనేవి జరుగుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: