టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు రీసెంట్ గా 'సర్కారు వారి పాట' సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘SSMB28’ చేస్తున్నాడు. ఏకంగా 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. గతంలో వీళ్ల ఇద్దరి కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు కమర్షియల్గా భారీ విజయాలు సాధించకపోయినా బుల్లితెరపై మాత్రం ఊహించని రీతిలో ఘన విజయం సాధించాయి. ఇక మూడో సారి ఈ కాంబో సెట్ అవడంతో ప్రేక్షకులలో ఎన్నో రకాల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాంచి కిక్ యాస్ యాక్షన్ ఎపిసోడ్తో షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా .. ఇప్పటివరకు కూడా మరో షెడ్యూల్ ప్రారంభించలేదు.దానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. మహేష్ తల్లిదండ్రులు చనిపోవడంతో పరిస్థితిలు వల్ల షూటింగ్ వాయిదా పడుతూ ఉంది. ఇక దీంతో సినిమా ఆగిపోయిందని కూడా పలు వార్తలు పుట్టుకొచ్చాయి.
హీరో సూపర్ స్టార్ మహేష్బాబు కథలో కొన్ని చేంజెస్ చేయమని త్రివిక్రమ్కు సూచనలు ఇచ్చాడట.ఇంకా అంతేకాకుండా థమన్ పట్ల కూడా కొంచెం అసహనంగానే ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. థమన్ ప్లేస్లో అనురుధ్ను తీసుకోవాలని మహేష్ బాబు అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం తెలిసింది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం థమన్ ని తీసేయలేదని సమాచారం. త్రివిక్రమ్ మహేష్ తో మాట్లాడి అంతా సెట్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు చాలా తీవ్ర విషాదంలో ఉన్నాడు.అందుకే ఇప్పుడప్పుడే షూటింగ్లో పాల్గొనే అవకాశాలు లేవు. దాంతో ఈ సినిమా మరింత ఆలస్యం కానుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇందులో మహేష్కు జోడీగా హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది.