తరుణ్ భాస్కర్ "కీడా కోలా" మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయినటువంటి తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ భాస్కర్ , విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి చూపులు మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. చిన్న సినిమాగా విడుదల అయిన పెళ్లి చూపులు మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా తరుణ్ భాస్కర్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలా పెళ్లి చూపులు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ నగరానికి ఏమైంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్ ఎన్నో మూవీ లలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ దర్శకుడు తన కెరీర్ లో మూడవ సినిమాగా కీడా కోలా అనే మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయినట్లుగా తెలియజేశాడు. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం విడుదల చేయనున్నారు. పెళ్లి చూపులు , ఈ నగరానికి ఏమైంది లాంటి వరుస విజయాల తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో కీడా కోలా మూవీ పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: