"ఆది పురుష్" మూవీ అన్ని భాషల ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా , కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ లో వి ఎఫ్ ఎక్స్ పనులు అత్యధికంగా ఉండడం వల్ల  ,ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా నిర్వహిస్తోంది.

కొంత కాలం క్రితం ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఈ మూవీ ని చిత్ర బృందం సంక్రాంతి భరి నుండి తప్పించింది. అందుకు కారణం ఈ మూవీ కి అత్యధికంగా వి ఎఫ్ ఎక్స్ ఉండడం అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు కలిగి ఉన్నాయి. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క అన్ని భాషల ఓవర్సీస్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ దక్కించుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం  ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను కూడా విడుదల చేయగా ,  వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: