రష్మి- సుడిగాలి సుధీర్ ఓ వైపు, వర్ష-ఇమ్మాన్యుయెల్ మరోవైపు ఈ రెండు జంటలు `జబర్దస్త్` షోలో తెగ ప్రేమించుకుంటోన్న విషయం తెలిసిందే.అయితే కొన్ని రోజుల పాటు జబర్దస్త్ ని సుడిగాలి సుధీర్ వదిలేసిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇక సినిమాలతో బిజీగా ఉండటం, ఇతర టీవీ ఛానెల్లో ఆయనకు ఆఫర్ రావడంతో జబర్దస్త్ ని వదిలేశాడు. కాగా అవి కంప్లీట్ కాగానే మళ్లీ `జబర్దస్త్`కి వచ్చాడు సుధీర్.ఇక ఈ వారం నుంచి ఆయన సందడి చేయబోతున్నారు.కాగా వచ్చీ రావడంతో పెద్ద ఫిట్టింగ్లు పెట్టారు. షోలో ఇతర కమెడియన్ల లవర్స్ ని గెలకడం స్టార్ట్ చేశారు.
ఇక షోలో మరోసారి రష్మికి ప్రపోజ్ చేశాడు. వాడిపోయిన గులాబి పువ్వుని తీసుకుని `నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వే ఏడిస్తే నేను చచ్చిపోతా` అని మరోసారి తన పాపులర్ డైలాగ్ని చెప్పాడు. అయితే దీంతో రష్మి పెద్ద షాకిచ్చింది. ఇక చావు రా చావు అంటూ ముఖం మీదే చెప్పేసింది. అయితే దీంతో సుధీర్కి మైండ్ బ్లాక్ అయ్యింది.కాగా షోలో నవ్వులు విరిసాయి.ఇకపోతే ఆ తర్వాత గాలి వారి పెళ్లి పిలుపు అనే కార్యక్రమంలో ఊహించని విధంగా వర్షతో కలిసి స్టెప్పులేశాడు సుధీర్. అంతేకాదు ఇక వర్ష పెళ్లికూతురిలా ముస్తాబు కావడం విశేషం.కాగా అందరి ముందే సుధీర్ని నిలదీసింది వర్ష.
అయితదా మన పెళ్లి అసలు అని అనగా, `గాలోడు` రిలీజ్ కాగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు సుధీర్.ఇక సరే నాకు అర్థమైంది ఇది అవదని అంటూ చెప్పడంతో సుధీర్కి దిమ్మతిరిగిపోయింది.అయితే మొత్తంగా సుధీర్ వచ్చీ రాగానే వర్ష వెంటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇక అందుకు వర్ష కూడా సుముఖంగానే ఉండటం ఇప్పుడు షాకిస్తుంది. ఇది సుధీర్ .. ఇమ్మాన్యుయెల్ పొట్టగొడుతున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు ఆడియెన్స్. అయితే ఇక చివర్లో మరోసారి సుధీర్, రష్మి కలిసి డ్యూయెట్ పాడుకోవడం ఇందులో హైలైట్ గా నిలిచింది. ఇదిలావుంటే మరోసారి పాత రోజులను గుర్తు చేసింది.అయితే ఈ ఇద్దరు రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోవడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.ఇక ప్రస్తుతం సుడిగాలి సుధీర్ `గాలోడు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతుంది. అయితే చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన రెండు జబర్దస్త్ షోస్లో సందడిచేశారు. అంతేకాదు తన యూనిట్తో కలిసి అలరించారు..!!