రామ్ చరణ్ తో సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి..!?

Anilkumar
పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపిన చిత్రం 'కాంతారా' .ఇక హీరో రిషబ్ శెట్టి ముందుగా ఒక డైరెక్టర్ అనే విషయం చాలా మందికి తెలీదు..అయితే ఆయన కన్నడ లో డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు..ఇక అందులో 'కిరిక్ పార్టీ' కూడా ఒకటి..ఈ సినిమాని తెలుగులో నిఖిల్ రీమేక్ చేసాడు..ఇక ఇది ఇలా ఉండగా ఈ బ్లాక్ బస్టర్ 'కాంతారా' చిత్రాన్ని తొలుత దివంగత హీరో..కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో చెయ్యాలనుకున్నాడట రిషబ్.అయితే అప్పుడు పునీత్ ఇది నీ ఊరి కథ..ఎప్పటి నుండో నువ్వు హీరో గా సినిమా చెయ్యాలనుకుంటున్నావు..

ఇక ఈ సినిమా నీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది..నువ్వే చెయ్యి అని చెప్పడం తో ధైర్యం చేసి ఈ సినిమా ని చేసాడు రిషబ్ శెట్టి ..ఇక తర్వాత జరిగింది మొత్తం మనకి తెలిసిందే..ఇక రాత్రికి రాత్రే ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు..ఇది ఇలా ఉండగా రిషబ్ శెట్టి కి మన టాలీవుడ్ స్టార్ హీరోలతో ఒక సినిమా చెయ్యాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది.ఇదిలావుంటే ఇక ఈ క్రమం లో ఈమధ్యనే ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి ఒక కథని వినిపించాడని..త్వరలోనే వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నారంటూ సోషల్ మీడియా లో వార్తలు జోరుగా వచ్చాయి..

అయితే ఇదే విషయాన్నీ ఇటీవల ఒక జాతీయ మీడియా కి రిషబ్ శెట్టి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా 'రామ్ చరణ్ ని కలిసి నేను స్టోరీ చెప్పడం అనేది అవాస్తవం..ఇక చరణ్ గారితో సినిమా చేసే అవకాశం వస్తే అది నా అదృష్టం గా భావిస్తాను..ఇకపోతే ఎప్పటి నుండో ఆయనతో ఒక సినిమా చెయ్యాలను ఉంది..అయితే అందుకు కథ కూడా సిద్ధంగా ఉంది..త్వరలో అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నాను' అంటూ సమాధానం ఇచ్చాడు.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ గారి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ సినిమా తర్వాత ఆయన jersey మూవీ డైరెక్టర్ గౌతమ్ తో ఒక మూవీ కమిట్ అయ్యాడు..కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడడం వల్ల ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది..ఇక ఈ సినిమా బదులుగా రామ్ చరణ్ - రిషబ్ శెట్టి కాంబినేషన్ లో మూవీ ఉంటుంది అనుకున్నారు.. అది ప్రస్తుతానికి అయితే ఫేక్ న్యూస్ అని తేలింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: