కమల్, మణిరత్నం.. ఎప్పుడు చేస్తారు?

P.Nishanth Kumar
కమల్ హాసన్ లాంటి హీరోతో సినిమా చేయాలనే కోరిక దేశంలోని ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుంది. మంచి హావ భావాలను పలికిస్తూ సినిమాకు ప్రాణం పోసే కమలహాసన్ ప్రస్తుతం భారీ యాక్షన్ సినిమాలను చేస్తూ యువ హీరోలకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు రెండు భారీ యాక్షన్ సినిమాలను చేయబోతున్న కమల్ హాసన్ మరొక సినిమాను కూడా ఓకే చేశాడు అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా నిన్న వచ్చింది.

నాయకుడు సినిమాను ఎంతో అద్భుతంగా రూపొందించి దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కిన మణిరత్నం చాలా రోజుల తరువాత కమల్ హాసన్ తో కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నాడు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత కలిసి సినిమాను వీరు చేయబోతూ ఉండడం సినిమా పట్ల ఎన్నో అంచనాలను పెరగడానికి కారణం అవుతుంది. ఇద్దరు కూడా స్టార్స్ అవడంతో ఈ సినిమా తప్పకుండా వేరొక స్థాయిలోనే ఉంటుంది అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజుల వ్యవధి రావడం వీరిద్దరి మధ్య ఏ విధమైన అండర్స్టాండింగ్ ఉంటుందో అనేది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్న కమల్ హాసన్ ఆ తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ 2 సినిమాను చేయబోతున్నాడు. ఆ విధంగా ఈ రెండు భారీ యాక్షన్ సినిమాల తరువాత మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ ఈ సినిమా చేయబోతున్నాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతం మణిరత్నం ఒక భారీ హిస్టారికల్ సినిమాను చిత్రీకరించే పనిలో ఉన్నారు ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం సంచలన విజయం అందుకోగా ఇప్పుడు రెండవ భాగం పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఈ సినిమా రెండవ భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: