'ఖడ్గం' సినిమా నుండి నాగార్జున, వెంకటేష్ తప్పుకోవడానికి కారణం ఏంటి..?

Anilkumar
స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా  అప్పట్లో ఎంత సెన్సెషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారిలా చూపించడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి ముస్లిం మతస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. థియేటర్లపై కూడా దాడులు కూడా చేశారు. ఇకపోతే ఖడ్గం మూవీ విడుదలైన తర్వాత కృష్ణవంశీ ప్రాణభయంతో వారంరోజులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారని టాక్ కూడా నడిచింది.  అయితే అసలు ఇలాంటి సినిమాని తెరకెక్కించేందుకు అప్పట్లో ఏ దర్శకుడు కూడా సాహసం చేసే వారు కాదు. 

2002 వ సంవత్సరం నవంబర్ 29న ఈ చిత్రం విడుదలైంది.ఇక  ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.కాగా  రవితేజ అప్పటికే 3 హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉండడంతో ఈ సినిమాకి అతని క్రేజ్ మరింతగా యాడ్ అయ్యిందనే చెప్పాలి. అయితే  ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు.ఇకపోతే అంతా బానే ఉంది కానీ ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్రకి వెంకటేష్ లేదా నాగార్జునలని తీసుకోవాలని ముందుగా నిర్మాత అనుకున్నారట.  వాళ్ళు బిజీగా ఉండడంతో శ్రీకాంత్ ను ఫైనల్ చేశారు.

సెట్స్ పైకి వెళ్లే కొద్దిరోజుల ముందు కూడా నిర్మాత సుంకర మధు మురళి.. 'శ్రీకాంత్ కు బదులు వేరే హీరోని తీసుకుందాం. ఇక అందుకు రూ.1 కోటి బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు' అని దర్శకుడు కృష్ణవంశీతో డిస్కషన్ చేశాడట. కృష్ణ వంశీ మాత్రం ససేమీరా అన్నాడట.ఇక  నేను శ్రీకాంత్ ను దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నాను.కాగా ఇప్పుడు మీరు అతన్ని వద్దు అంటే కనుక నేను కూడా ఇంకో నిర్మాతని చూసుకుంటాను' అని తేల్చి చెప్పేశాడట.ఇక  అలా అది శ్రీకాంత్ చేయడం 'ఖడ్గం' సూపర్ హిట్ అవ్వడం. అయితే  అటు తర్వాత శ్రీకాంత్ నటించిన 'పెళ్ళాం ఊరెళితే' 'ఒట్టేసి చెబుతున్నా' వంటి సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ కావడంతో అతను స్టార్ హీరోగా మారాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: