తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్న వారిలో మేహర్ రమేష్ ఒకరు. ఈ దర్శకుడు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరో ల సినిమాలకు దర్శకత్వం వహించాడు. దాదాపు అందులో బిల్లా సినిమాను మినహాయిస్తే , ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. మెహర్ రమేష్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కంత్రి , బిల్లా , శక్తి , షాడో మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఆఖరుగా మెహర్ రమేష్ విక్టరీ వెంకటేష్ హీరోగా తాప్సి హీరోయిన్ గా తెరకెక్కిన షాడో మూవీ కి దర్శకత్వం వహించాడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెహర్ రమేష్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇది ఇలా ఉంటే భోళా శంకర్ మూవీ తమిళం లో సూపర్ హిట్ గ నిలిచిన వేదాళం మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మెహర్ రమేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ ... మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తాను అని మెహర్ రమేష్ తాజాగా చెప్పు కొచ్చాడు.