చంద్రబాబు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమ్మిరెడ్డి..!!
తమ్మారెడ్డి గారు ఇలా అన్నారు.. 30 ఏళ్ల కిందట విషయాలు ఇప్పుడు అవసరం లేదట.కాకపోతే ఇక్కడ లక్ష్మీపార్వతి వెన్నుపోటు అంటూ ఆమె కోణాన్ని చెబుతోంది. ఇక చంద్రబాబు నాయుడు తన పార్టీని కాపాడుకోవడం కోసం తన కోణంలో చెబుతున్నాడు. వాస్తవం ఏమిటంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్లు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీ అధినేతగా ఒప్పుకున్నారట.. అలాగే ఎన్నికలలో గెలిపించారు. కానీ ఆయనపై వీళ్లు వేసిన మచ్చ అలాగే ఉంది. ఎన్టీఆర్ గారు మరణించక ముందు ధర్మపీఠం అనే ఇంటర్వ్యూలో చంద్రబాబు పార్టీని లాక్కున్నాడు అన్నట్లుగా మాట్లాడారు.
ఇక ఎన్టీఆర్ మానసికంగా కుంగిపోయి మరణించారు. అది వాస్తవం.. ఇక ఆయన మరణించిన రోజు నేను వెళ్లేసరికి కుటుంబమంతా అక్కడే ఉంది. లక్ష్మీ పార్వతి అక్కడ ఎన్టీఆర్ ని పట్టుకొని స్వామి అంటూ ఏడుస్తోంది. నేను వెళ్ళాక అరగంటకు చంద్రబాబు వచ్చారు.అక్కడే ఉన్న లక్ష్మీ పార్వతి ఏమి మాట్లాడలేదు. కానీ అక్కడున్న ఒక వ్యక్తి మాత్రం ఎన్టీఆర్ శవం వద్దకు రానీయలేదట . నువ్వే ఆయన చావుకు కారణం.. ఆయనని మానసికంగా గురి చేసావు అంటూ మాట్లాడాడు. అయితే అదే వ్యక్తి.. చంద్రబాబు సీఎం అయినప్పుడు నామినేట్ పదవిలో ఉన్నాడు. అంటూ తమ్మారెడ్డి అప్పటి విషయాలను బయటకు తెచ్చాడట.