కృతిశెట్టికి నాగచైతన్యకి మధ్య ఏమైనా? మరి నాగార్జున ఎందుకు అలా అన్నారు...?
ఆ తరువాత అక్కినేని నాగ చైతన్య, నాగార్జున హీరోలుగా వచ్చిన బంగార్రాజు సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన సంగతి విదితమే. ఇక ఈ సినిమా కూడా ఒక మాదిరిగా ఆడటంతో కృతి శెట్టికి గోల్డెన్ లెగ్ అని నామకరణం చేసేసారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఈ సినిమా తరువాత ఒంటరిగా వున్న నాగ చైతన్యకి కృతిశెట్టి బాగా నచ్చిందేమో… మీడియాకి కాస్త క్లోజ్ గా కనిపించారు. అదిగో అక్కడి నుండి మొదలైంది అసలు విషయం. వారి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికారు చేసాయి. ఈ తరుణంలో తాజాగా కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
అవును, కృతి శెట్టి విషయంలో ప్రముఖ కమెడియన్ అయినటువంటి వెన్నెల కిషోర్ కి నాగార్జున నుండి తాజాగా ఓ వార్నింగ్ వచ్చిందట. విషయం ఏమంటే ఓ మీడియా వేదికగా వెన్నెల కిషోర్ కృతి శెట్టి మీద కుళ్ళు జోకులు వేస్తుంటే కృతి శెట్టి కి అర్థం కాక, నాగార్జున వైపు చూసిందట. దాంతో నాగ్ నా కోడలిపై ఇంకోసారి జోక్స్ వేస్తే బాగుండదు అంటూ వెన్నెల కిషోర్ కి సీరి యస్ వార్నింగ్ ఇచ్చారని గుస గుసలు వినబడుతున్నాయి.