నాలుగు నెలలకే కవల పిల్లలను తల్లి అయిన నయన్..!!

Divya
నయనతార-విగ్నేష్ నిన్నటి రోజున జంట కవలలకు స్వాగతం పలకడం జరిగింది. ఇక వీరిద్దరికి వివాహం అయ్యి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. అంతలోనే పిల్లలు కలగడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే నయనతార,విగ్నేష్ కొన్నేళ్లుగా సహజీవనం చేసుకున్నారు అని వార్తలు బాగా వినిపించాయి. ఇక తాము కవలల అబ్బాయిలకు స్వాగతించామని సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను విగ్నేష్ ప్రకటించడం జరిగింది. ఈ ఫోటోలో ఎంతో అన్యోన్యంగా కవలల పాదాలకు ముద్దు పెట్టుకుంటూ ఒక అరుదైన ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఉద్వేగానికి లోనైన విగ్నేష్ ఫోటోలకు ఒక అందమైన క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది.
నయన్ - నేను అమ్మ, అప్పగా మారాము.. మేము ట్విన్ బేబీ బాయ్స్ తో ఆశీర్వాదం అందుకున్నాము. పిల్లలు మా ఉయీర్, ఉలగం కోసం మీ అందరి ఆశీస్సులు కావాలని జీవితాంతం మీ అందరి ఆశీర్వాదం కావాలని తెలియజేశారు. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన నయనతార- విఘ్నేష్ శివం ఎట్టకేలకు 2002 జూన్ 9వ తేదీన మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. నాను రౌడీ ధాన్ సినిమా షూటింగ్లో ఉండంగానే ఈ జంట ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక అలా రెండేళ్ల తర్వాత సింగపూర్ లో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో వీరిద్దరూ జంటగా కనిపించారు.

ఇక 2021లో నయనతార తన సినిమా ప్రచారం కోసం విజయ్ టెలివిజన్లో కనిపించింది. అక్కడ తన రహస్య నిశ్చితార్థం గురించి తెలియజేసినట్లు సమాచారం. ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్ మేము ప్రైవేట్ వ్యక్తులం కాబట్టి వేడుకను ఘనంగా నిర్వహించాలనుకోలేదు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కచ్చితంగా అందరికీ అభిమానులకు తెలియజేస్తాము మా నిశ్చితార్థం మాత్రం మా కుటుంబ సభ్యుల సమక్షంలోని జరిగిందని తెలియజేసింది. ప్రస్తుతం నయనతార ,విగ్నేష్ కుమారులకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: