టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది... అదేంటంటే.. సినిమా రీ రిలీజ్..అన్నమాట... అయితే ప్రస్తుతం టాలీవుడ్లో కొనసాగుతున్న రీరిలీజ్ ట్రెండ్లోకి ఇప్పుడు మరో హీరో వచ్చారు.ఇక డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'రెబల్' సినిమాను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన సందర్భంగా రీరిలీజ్ చేయనున్నారు.తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది వరకే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేశ్ బాబు 'పోకిరి', టాలీవుడ్ స్టార్ హీరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా',నటసింహం నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాల రీరిలీజ్కు సైతం భారీగా అభిమానులు వచ్చారు. ఇదిలావుంటే ఇక తాజాగా ఈ ఖాతాలోకి ప్రభాస్ చేరారు.అయితే పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ నటించిన 'రెబెల్' పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.ఇకపోతే లారెన్స్ దర్శకత్వంలో 2012లో 'రెబెల్' సినిమా వచ్చింది.అయితే మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన తమన్నా నటించారు. ఇక ఈ మూవీలో ఇటీవలే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు
కూడా ఓ కీలక పాత్ర చేశారు. అయితే ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.కాగా 'రెబెల్' సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సంగీతాన్ని లారెన్స్ అందించారు. ఇకపోతే ఈ సినిమా విషయంలో నిర్మాతలకు లారెన్స్తో విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇక అక్టోబరు 15న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.కాగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. అంతేకాదు అలాగే ప్రశాంత్ దర్శకత్వంలో సలార్, నాగ్అశ్విన్తో మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు ప్రభాస్..!!