త్రిష - ఐశ్వర్యారాయ్ లకు సెట్లో వార్నింగ్ ఇచ్చిన మణిరత్నం .. ఇంకోసారి అలా కనిపించొద్దంటూ..?

Anilkumar
ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఓ సెట్‌లో ఉంటే మామూలుగా ఉండదు అని అంటుంటారు సినిమా జనాలు. అయితే ఇద్దరికీ పడితే ఓకే. ఇక అలా కాకుండా ఒకరంటే ఒకరికి పడలేదా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.ఇకపోతే ఒకరి గురించి ఒకరు వాకబు చేసుకుంటూ చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. ఇక అలాంటి హీరోయిన్ల కాంబినేషన్‌ను గతంలో కొన్నిసార్లు చూశాం.అయితే  అలా కాకుండా మల్టీస్టారర్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కలసి ఎంచక్కా సెట్స్‌లో ఎంజయ్‌ చేస్తుంటారు కూడా. అయితే ఇద్దరు హీరోయిన్ల ఫ్రెండ్లీగా ఉండటం చూసి ఆ సినిమా దర్శకుడు వార్నింగ్‌ ఇచ్చారు అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది.

ఇక అది కూడా చిన్న దర్శకుడేం కాదు, చిన్న సినిమా కూడా కాదు.ఇకపోతే  'పొన్నియిన్‌ సెల్వన్‌ 1' సినిమా షూటింగ్‌ జరిగిందే పైన చెప్పిన కథంతా. కాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్య రాయ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ ఇద్దరూ సెట్స్‌లో సరదాగా ఉండేవారట. అయితే దీంతో మణిరత్నం ఇద్దరికి క్లాస్ తీసుకున్నారట.ఇక  మీరిద్దరూ సెట్స్‌లో ఇలా కలసి తిరగొద్దు అని గట్టిగానే చెప్పారట. దీని వెనుక పెద్ద కారణమే ఉందట.ఇకపోతే ఈ సినిమాలో ఐశ్వర్య, త్రిష బద్ధ వ్యతిరేకులుగా కనిపిస్తారట. అయితే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండుతుందట.

ఇక  అలాంటి ఇద్దరూ స్నేహంగా ఉంటే యాక్షన్‌ చెప్పగానే ఫీల్ ఉండదేమో అని ఆయన భయమట.  కొన్ని సన్నివేశాల విషయంలో ఫీల్‌ రాక మణిరత్నం ఇబ్బంది పడ్డారట. ఇక దీంతో చూసీ చూసీ ఓ రోజు సెట్‌లో ఇద్దరినీ పిలిచి వార్నింగ్‌ ఇచ్చారట.అయితే మణిరత్నం హెచ్చరిక తర్వాత సెట్స్‌లో ఐశ్వర్యకు త్రిష కాస్త దూరంగా ఉందట. ఇక అప్పటి నుండి సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదట.  మణిరత్నం ఊపిరి పీల్చుకున్నారట.అయితే  కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇక రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం సెప్టెంబర్ 30న వస్తోంది. సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: