మహేష్ పై కోపంగా వున్న ఫ్యాన్స్...!!

murali krishna
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..కేవలం ఆయనకీ ఉన్న బ్రాండ్ ఇమేజి తో వందల కోట్ల రూపాయిలు బిజినెస్ లు జరుగుతాయి..ఆయన యావరేజి సినిమాలు కూడా అతి తేలికగా వంద కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తాయి..అందుకే మహేష్ బాబు ని తమ ప్రమోటర్ గా చేసుకునేందుకు ప్రముఖ బ్రాండ్ కంపెనీలు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి మహేష్ బాబు చేత తమ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకుంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు ..అయితే ఇప్పుడు మహేష్ బాబు గతం లో చేసిన బ్రాండ్స్ అన్నిటిని అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ చేస్తున్నారు..మహేష్ బాబు ప్రస్తుతం ఒకటి రెండు కమర్షియల్ యాడ్స్ మినహా మరో యాడ్ లో నటించడలేదు..దీనితో జీ తెలుగు సంస్థ వారు మహేష్ బాబు కి భారీ ఆఫర్ ఇచ్చింది..తమ టీవీ ఛానల్ మరియు OTT లో వచ్చే ప్రతి కంటెంట్ ని ప్రమోట్ చేస్తే భారీ మొత్తం లో పారితోషికం చెల్లిస్తామంటూ ముందుకు వచ్చారు..వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా అద్భుతంగా ఉండడం తో మహేష్ జీ తెలుగు ఆఫర్ ని ఒప్పకొక తప్పలేదు .
జీ తెలుగు లో వచ్చే సీరియల్స్ దగ్గర నుండి గేమ్ షోస్ వరుకు ప్రతి ఒక్కటి మహేష్ బాబు ప్రొమోషన్స్ చెయ్యాల్సిందే..అందులో భాగంగానే జీ తెలుగు లో అతి త్వరలో ప్రసారం కాబోతున్న 'పడమటి సంధ్యారాగం' సీరియల్ కి సంబంధించి మహేష్ బాబు మరియు ఆయన కూతురు సితార కలిసి ఇచ్చిన ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అంతే కాకుండా మహేష్ బాబు ని సొంత అభిమానులే తిట్టే విధంగా చేసింది ఈ యాడ్..'నువ్వెంటి నీ రేంజ్ ఏంటి..నీ లాంటి సూపర్ స్టార్ చీప్ గా సీరియల్స్ కి ప్రమోట్ చెయ్యడం ఏంటి' అంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు.
 
మరి దీనిపై మహేష్ బాబు స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాలి..ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయ్యే సినిమా నిన్న రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకుంది..ఈ సినిమా తర్వాత ఆయన దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: