మహేష్ పై కోపంగా వున్న ఫ్యాన్స్...!!
జీ తెలుగు లో వచ్చే సీరియల్స్ దగ్గర నుండి గేమ్ షోస్ వరుకు ప్రతి ఒక్కటి మహేష్ బాబు ప్రొమోషన్స్ చెయ్యాల్సిందే..అందులో భాగంగానే జీ తెలుగు లో అతి త్వరలో ప్రసారం కాబోతున్న 'పడమటి సంధ్యారాగం' సీరియల్ కి సంబంధించి మహేష్ బాబు మరియు ఆయన కూతురు సితార కలిసి ఇచ్చిన ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అంతే కాకుండా మహేష్ బాబు ని సొంత అభిమానులే తిట్టే విధంగా చేసింది ఈ యాడ్..'నువ్వెంటి నీ రేంజ్ ఏంటి..నీ లాంటి సూపర్ స్టార్ చీప్ గా సీరియల్స్ కి ప్రమోట్ చెయ్యడం ఏంటి' అంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు.
మరి దీనిపై మహేష్ బాబు స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాలి..ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయ్యే సినిమా నిన్న రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకుంది..ఈ సినిమా తర్వాత ఆయన దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.