గణేష్ నిమర్జనంలో సందడి చేస్తున్న బన్నీ..!!

Divya
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే పలు యాడ్సులలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తూ బిజీగా ఉంటున్నారు అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ తన కూతురితో కలిసి గణేష్ నిమర్జనంలో పాల్గొనడం జరిగింది. జూబ్లీహిల్స్ లో గీత ఆర్ట్ సంస్థలు ఎలగొన్న వినాయకుడిని ఈ రోజున నిమజ్జనం చేసేందుకు అల్లు అర్జున్ అక్కడికి రావడం జరిగింది అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా తన కూతురితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఇక అల్లు అర్హత తయారు చేసిన విగ్రహాలను సైతం తీసుకువచ్చి ఆ తర్వాత అల్లు అర్జున్ తన కూతురితో కలిసి డ్యాన్స్ వేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి పలు వీడియోస్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదంతా ఇలా ఉండగా డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ని తెరకెక్కించే పనిలో చిత్రంలో ఉన్నారు. ఇక అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా గత కొద్ది రోజుల క్రితం పూర్తి చేసుకున్నారు.

ఇక అల్లు అర్జున్ పుష్పరాజు పాత్రలో ఊర మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కూడా నటిస్తున్నది. ఇక ఇందులో అనసూయ, సునీల్ తదితర నటీనటులు కీలకపాత్రలో నటించారు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా అయిపోయిన వెంటనే ఐకాన్ అనే సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. మరి అల్లు అర్జున్ పుష్ప -2 సినిమాతో ఎన్ని రికార్డులను సైతం తిరగ రాస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: